సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి మావోయిస్టు అగ్రనేతలు

జనతా వార్ హైదరాబాద్ మే 30

సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మావోయిస్టు అగ్రనేతలు

అటవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలిసి మాజీ మావోయిస్టులను కమ్యూనిస్టులంతా మాతృ సంస్థ అయిన సిపిఐలో చేరాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు మరోసారి ఆహ్వానం పలికారు. మాజీ మావోయిస్టులు దేవజీ(టిప్పిరి తిరుపతి),మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్‌), పుల్లూరి ప్రసాద్‌ రావు (చంద్రన్న) శనివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర నాయకత్వాన్ని మార్యద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సిపిఐ నేతలతో సమావేశమైయ్యారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కగార్‌ అపరేషన్‌కు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం, తదితర వామపక్షపార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు, మేధావులు అనేకమంది అనేక రూపాలలో ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అడవుల్లో ఉన్న మావోస్టులు ప్రాణాలు కాపాడబడాలని కోరుకున్నారు. ఎన్‌కౌంటర్‌ పేరుతో ఏమి చేస్తారో తెలియని భయానక పరిస్థితుల్లో పాత్రికేయులు సహా అందరూ ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జన జీవన స్రవంతిలో కలిసి ఈ ముగ్గురు నేతలు కమ్యూనిస్టు పార్టీగా, కమ్యూనిజం పట్ల అభిమానం కలిగిన వారిగా సిపిఐ కార్యాలయానికీ రావాలనుకున్నారని, అయితే అప్పడు సమయం కుదరకపోవడంతో ఇప్పుడు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా తమ కార్యాలయానికి వచ్చిన ఆ ముగ్గురుకి సిపిఐ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలపడం జరిందన్నారు. ప్రస్తుతం తమ మధ్య మర్యాదపూర్వక సమావేశం జరిగిందని రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు జరిపి, వారి భవిష్యత్తు ఏమిటి అనే దానిపై చర్చిస్తామని తమ ఆలోచనలను వారితో పంచుకుని, తెలంగాణకి, దేశానికి మంచి జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. తద్వారా దేశంలో మతోన్మాద, ఫాసిస్ట్‌ శక్తులకు వ్యతిరేకంగా బలంగా నిలబడగల శక్తి కమ్యూనిస్టు ఉద్యమానిదేనని అభిప్రాయపడ్డారు. త్వరలో అందరూ కలిసి మారిసారి సమావేశమై తమ రాజకీయ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తారని కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేవ్‌జీ మాట్లాడుతూ సిపిఐ నేతలను తాము కేవలం మర్యాదపూర్వకంగా కలిసేందుకు మాత్రమే వచ్చామని వెల్లడించారు.

Latest articles

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...

పవన్ వాక్యాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

జనతా వార్ హైదరాబాద్ జూన్ 3 కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర...

ఈదులకుంట చెరువు పరిరక్షణలో సిపిఐ పోరాటం ఫలించింది టి రామకృష్ణ

జనతా వార్ హైదరాబాద్ మే 28 ఈదులకుంట చెరువు పరిరక్షణలో సిపిఐ పోరాటం ఫలించింది* శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఖానామెట్ సర్వే నెంబర్...

More like this

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...

పవన్ వాక్యాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

జనతా వార్ హైదరాబాద్ జూన్ 3 కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర...