సీఎంగా మళ్ళీ విజయానే

కేరళ సీఎంగా మళ్లీ విజయనే

కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌

తిరువనంతపురం: కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ కొనసాగుతారని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ”విజన్‌ 2031: డెవలప్‌మెంట్‌ అండ్‌ డెమొక్రసీ” అనే అంతర్జాతీయ సెమినార్‌ను ఆదివారం ఇక్కడ ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సమక్షంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలు చేయడంలో కేరళ అగ్రగామి స్థానాన్ని చట్టబద్ధంగా కాపాడుకోవడానికి అవసరమైన సవరణలు ప్రతిపాదించబడుతున్నాయని అయ్యర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశం పట్ల మహాత్మా గాంధీ దార్శనికతను గుర్తుచేసుకుంటూ, పేద పౌరులు కూడా యాజమాన్య భావాన్ని అనుభవించి, దేశ నిర్మాణంలో చురుగ్గా పాల్గొనే దేశం గురించి గాంధీజీ కలలు కన్నారని అయ్యర్‌ అన్నారు.

ఈ ఆదర్శం వైపు అత్యంత ప్రశంసనీయమైన పురోగతి కేరళ వామపక్షాల పాలనలో సాధించిందని ఆయన గుర్తుచేశారు.వికేంద్రీకృత పాలనలో కేరళ సాధించిన విజయాలను అయ్యర్‌ తెలిపారు. కేరళను ప్రజాస్వామ్యంలో దేశం యొక్క ఆచరణాత్మక నాయకుడిగా అభివర్ణించారు. స్థానిక స్వపరిపాలన పట్ల దశాబ్దాలుగా రాజకీయ నిబద్ధత చూపడం ద్వారా కమ్యూనిటీలకు సాధికారత కల్పించడంతోపాటు సామాజిక ఫలితాలను మెరుగుపరిచారని ఆయన ప్రశంసించారు.

కేరళ పనితీరు అనేక సందర్బాల్లో జాతీయ అంచనాలను మించిపోయిందని ఆయన పేర్కొన్నారు. మూడంచెల పంచాయతీ రాజ్‌ పాలన సాధనలో కేరళ దేశంలో మొదటి స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఆలోచనలు కేరళలో మరే ఇతర రాష్ట్రంలో కంటే సమర్థవంతంగా అమలు చేయబడ్డాయన్నారు. అమలులో కేరళ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, చట్టం పరంగా అది రెండవ స్థానంలో ఉందని ఆయన ఎత్తి చూపారు. పంచాయతీ రాజ్‌లో కేరళ నంబర్‌ వన్‌ స్థానాన్ని ధ్రుఢపరుచుకోవడానికి కేరళ సొంత అనుభవాలు, థామస్‌ ఐజాక్‌ సూచనలు, ఆయన అధ్యక్షత వహించిన ఐదు సంపుటాల నివేదిక ఆధారంగా శాసన సవరణలు తీసుకురావాలని ఆయన కోరారు

Latest articles

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...

పవన్ వాక్యాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

జనతా వార్ హైదరాబాద్ జూన్ 3 కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర...

More like this

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...