ప్రశ్నించే గొంతుక సిపిఐ అభ్యర్థిని గెలిపించండి
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
11వ వార్డులో CPI అభ్యర్థి నరేష్ నామినేషన్
జనతా వార్ జనవరి 30 చేర్యాల : ప్రజా సమస్యలపై పోరాడే ప్రశ్నించే గొంతుక సిపిఐ అభ్యర్థి11వ వార్డు అభ్యర్థి రామగల్ల నరేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 11వ వార్డు సీపీఐ కౌన్సిలర్ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడు రామగళ్ళ నరేష్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. ఈ సందర్భంగా సీపీఐ నేత అందే అశోక్ మాట్లాడుతూ.. చేర్యాల పట్టణంలో నెలకొన్న అనేక మౌలిక సమస్యలపై ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్న పార్టీగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని అన్నారు. విద్యార్థి నాయకుడిగా, చదువుకున్న వ్యక్తిగా సిపిఐ అభ్యర్థి రామగళ్ల నరేష్ గత 15సంవత్సరాలుగా విద్యారంగ సమస్యల పరిష్కారంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ప్రశ్నించే గొంతుకగా చదువుకున్న విద్యావేత్తగా ముందుకు వస్తున్నాడని సిపిఐ అభ్యర్థిగా ఆశీర్వదించి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. సిపిఐ అభ్యర్థి రామగల్ల నరేష్ మాట్లాడుతూ.. పట్టణంలో మున్సిపల్ కార్యాలయాన్ని తిరిగి పున: ప్రారంభించాలని, డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణం, ప్రతి ఇంటికి త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం పనిచేస్తూ, ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని, డబ్బులు, మద్యం ప్రలోభాలకు గురికాకుండా నీతి నిజాయితీగా పనిచేస్తున్న తమను ఆశీర్వదించి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఈరి భూమయ్య,జంగిలి యాదగిరి,నంగి కనకయ్య, సుంకోజు రజిత, ముస్త్యాల కనకబాబు, భూమిగారి శివకుమార్, గోమారపు నర్సయ్య, గందమల్ల శ్రావణ్ కుమార్,సాహేద్, కల్లాటి మహాదేవులు, పుట్ట వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
