బాసర ఎస్బిఐ బ్యాంకు లో చోరీ

బాసర ఎస్బిఐ బ్యాంకులో చోరీ… రైతు జేబులో నుంచి నగదు అపహరణ

జనతా వార్ జనవరి:28

బాసర మండల దొడాపూర్ గ్రామానికి చెందిన దత్తురామ్ అనే రైతు తన చేనులో పనిచేస్తున్న కూలీలకు కూలీ డబ్బులు చెల్లించేందుకు నగదు తీసుకునేందుకు బుధవారం బాసర ఎస్బిఐ బ్యాంకు వచ్చాడు. ముందుగా తన ఖాతా నుంచి రూ. 50,000 నగదు ఉపసంహరించుకున్నాడు. డబ్బులు సరిపోకపోవడంతో మళ్లీ తన ఖాతా నుంచి రూ. 30,000 తీసుకునేందుకు బ్యాంకులో వరసలో నిలిచాడు. ఈ సమయంలో వెనుక నుంచి బుర్కా ధరించి ఓ గుర్తు తెలియని మహిళ రైతు జేబులో ఉన్న నగదును చాకచక్యంగా తీసుకొని అక్కడి నుంచి పరారయింది. కొద్దిసేపటి తర్వాత జేబులో డబ్బులు లేవని గుర్తించిన రైతు బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించాడు. ఎస్బిఐ అధికారులు బాసర ఎస్సై కి సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న బాసర ఎస్సై నవీన్ రెడ్డి వెంటనే ఎస్బిఐ బ్యాంకు చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. బాధ్యత రైతు దత్తు రాంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ చోరి ఘటన మొత్తం బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.

Latest articles

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...

పవన్ వాక్యాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

జనతా వార్ హైదరాబాద్ జూన్ 3 కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర...

More like this

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...