జనతా వార్ ఆగస్టు12
విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్
అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ ఐ ఎస్ ఫ్)91వ ఆవిర్భావ దినోత్సవాన్ని శేర్లింగంపల్లి మండల ఆధ్వర్యంలో కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది.
ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ 91
వ వార్షికోత్సవ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ శేర్లింగంపల్లి మండల అధ్యక్షుడు టి.నితీష్,కార్యదర్శి ధర్మ తేజ జెండా ఆవిష్కరించడం జరిగింది…
అనంతరం వారు మాట్లాడుతూ
భారతదేశ కోసం పొత్తిలోనే పిడికిలి బిగించి స్వాతంత్రం మా జన్మ హక్కు అని దేశం కోసం పోరాడినటువంటి విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది కేవలం మొట్టమొదటి విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు.
1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేష్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ఆజాద్ ల ఇంక ఎందరో అమర వీరుల ఆశయ సాధన కోసం బబ్రుద్దిన్ ద్దీన్, ప్రేమ్ నారాయణ భార్గవ్, నాయకత్వాన ఆవిర్భవించడం జరిగింది. పోరాటాలు త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్రనంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యా విధానం అమలుపై నిరంతరం పోరాటం సాగిస్తూ గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటాలు కొనసాగుతున్నాయి.
నాటి నుండి నేటి వరకు అనేక మైనటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రభుత్వ విద్య, విద్యాలయాల అభివృద్ధి , పేద బడుగు బలహీన వర్గాల ప్రజల విద్యార్థుల మేలు కోసం మాట్లాడుతుందని అన్నారు, ప్రస్తుతం సమాజంలో కార్పొరేట్ విద్యా విధానం హవా కొనసాగుతుంది వాటిని అదుపు పెట్టడంలో ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టుగా ఉంటూ ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రభుత్వ విద్యకు ద్రోహం చేస్తూ డబ్బుంటే హై హై డబ్బు లేదంటే నహి నహి ఉన్నట్టుగా పేద విద్యార్థి జీవితాలు కొనసాగుతున్నాయి.
ఈ దోపిడీ విద్యా విధానం కి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ పోరాడుతుందని శేర్లింగంపల్లి మండల అధ్యక్షుడు టి.నితీష్,కార్యదర్శి ధర్మ తేజ అన్నారు. ఈ కార్యక్రమంలో
తదితరులు పాల్గొన్నారు