జనతా వార్ శేర్లింగం జులై 22
రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం..
నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం సమీపంలో నిరసన చేపట్టిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విడుదల చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది.నీట్ పేపర్ లీక్ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్, శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్ పాల్గొనడం జరిగింది.