ఈదులకుంట చెరువు పరిరక్షణలో సిపిఐ పోరాటం ఫలించింది టి రామకృష్ణ
జనతా వార్ హైదరాబాద్ మే 28 ఈదులకుంట చెరువు పరిరక్షణలో సిపిఐ పోరాటం ఫలించింది* శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఖానామెట్ సర్వే నెంబర్ 7లో ఉన్న సుమారు 6 ఎకరాల 5 గుంటల ఈదులకుంట చెరువు భూమిని కబ్జా నుంచి కాపాడడంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పోరాటం కీలక పాత్ర పోషించిందని పార్టీ నాయకులు తెలిపారు. కోట్ల రూపాయల విలువైన చెరువు భూమిని సర్వే నెంబర్లను తారుమారు చేసి ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించిన సిపిఐ నాయకులు,...