janatawar.com
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 6:46 am Editor : Admin

ఆఖరాలు (అఘోరాలు )ఎవరు..?

అఖారాలు( అఘోరాలు )ఎవరు………….!!

బెంగాల్ కు చెందిన మధుసూదన సరస్వతి దీనిని ఏర్పాటు చేశారు. ఇది నాగ సాధువులలో ఒక శాఖ లాంటిది. వీళ్ళు దిగంబరంగా ఆయుధాలతో ఉంటూ ఎల్లప్పుడూ హిందువులను మొఘల్స్ నుండి రక్షించడానికి 16 వ శతాబ్దం లో ఏర్పాటు చేసిన ఒక “నాగ” విభాగం. వీరినే గుసైన్, గుస్సైన్, గోసైన్, గోస్సైన్, గోసిన్, గోసవి, సన్యాసి అనే విభాగాలు. వీరిలో వీరుల వీరత్వాన్ని గురించి మనకు సాధారణ శకం 155 మారియు 1700 లకు పూర్వమే చెప్పబడింది. వీరు పాటించే ధర్మం కూడా శంకరులు చెప్పినట్టుగా కనపడుతుంది.

ప్రస్తుతం అఖారా వారు జున అఖారా గా దశనామి నాగ, నిరంజనిఅఖారా, ఆనంద్ అఖారా, అటల్ అఖారా, ఆవాహన్ అఖారా, అగ్ని అఖారా మరియు నిర్మల్ పంచాయతీ అఖారా లుగా అలహాబాద్ లో కనపడుతారు. ఒక్కో అఖారా కొన్ని చిన్న చిన్న శాఖ లుగా , ఆచారాలుగా విడిపోయారు. దానికి ఉదాహరణ నే దత్తాత్రేయ అఖారా(ఉజ్జయిన్). వీళ్ళు కూడా జూనా నాగాలులాగా దిగంబరంగా ఉంటారు.

సాధారణం గా నాగ సాధువులు అహింస కు దగ్గరలో వున్నారు ప్రస్తుతం, కొన్ని శాఖలు మల్లయుద్ధం లాంటివి(రెస్లింగ్)కూడా చేయగలరు. ఇక దశనామి సన్యాసులు వేద ధర్మం చెప్పిన దాని ప్రకారం అహింస, సత్యం, ఆస్తెయా, అపరిగ్రహ, బ్రహ్మచర్య లను సాధన చేస్తుంటారు.

కుంభమేళా లో కూడా నీళ్లలోకి రావడం కూడా ఒక ఆచారం గానే కొనసాగింది. జూనాఅఖారా తరువాత నే నిరంజని, మాహానిర్వని వారు స్నానం చేసేవారు.రామకృష్ణ మఠం ఈ వరుసలో చివరిగా ఉంటుంది.