*ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన క్రాంతి కుమార్*
జనతా వార్ ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రతినిధి సక్రు నాయక్:
అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF నిజామాబాద్ లో ఫిబ్రవరి 18 19 20 తేదీలలో జరిగిన తెలంగాణ రాష్ట్రా 4వ మహాసభలో రంగారెడ్డి జిల్లాకు చెందిన గ్యార క్రాంతి కుమార్ ను తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. నా ఎన్నిక పట్ల జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ గారికి, మరియు జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ స్టాలిన్ గారికి, మాజీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర నిర్మాణ బాద్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధి , సొంత హాస్టల్ భవనాలను , ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ మహిళా కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గ కేంద్రాలలో కేటాయించాల్సిన అవసరం ఉందని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని, కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలల ఫీజుల దోపిడీ అరికట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలుపరుస్తామని, స్కాలర్షిప్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే విడుదల చేస్తామని హామీలు ఇచ్చారు. నేటికీ హామీలకే పరిమితమైంది తప్ప ప్రభుత్వ విద్యాలయాలు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏమీ లేదని , ప్రభుత్వ హాస్టల్లో నాణ్యతతో లేని ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తూ విద్యార్థులను అవస్థలకు గురి చేస్తూ ప్రభుత్వం విద్య పట్ల విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తుందని, విద్యారంగ సమస్యల పరిష్కారానికై పోరాడుతామని అన్నారు