janatawar.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 4:20 pm Editor : Admin

నాలుగు లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాడుదాం

  1. దేశవ్యాప్త సమ్మె విజయవంతం – ప్రజల ఐక్యతకు నిదర్శనం సిపిఐ రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు

జనతావా  శేరిలింగంపల్లి ఫిబ్రవరి 12

ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన సమ్మె విజయవంతంగా జరిగింది. కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు మరియు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను చాటారు.

శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ అంబేద్కర్ స్టాచ్ దగ్గర జరిగిన సమ్మెలో పాల్గొన్న సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని దేశవ్యాప్త సమ్మె విజయవంతం .కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల సవరణలు, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సమ్మెలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించబడ్డాయి. ప్రజల విస్తృత మద్దతుతో సమ్మె విజయవంతమైంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి భవిష్యత్తులో కూడా పోరాటాలు కొనసాగుతాయని నాయకులు హెచ్చరించారు.

ఈ సమ్మెను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు, కార్మిక సంఘాలకు, రైతు సంఘాలకు మరియు ప్రజాసంఘాల నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో. సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు. శేర్లింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి కె చందు యాదవ్ ఏఐటియుసి మండల అధ్యక్షులు తుపాకుల రాములు. డి హెచ్ పి ఎస్.ఎస్ కొండలయ్య. జెట్టి శ్రీనివాస్ మండల సహకార దర్శి. కే కృష్ణ సి ఐ టి యు. ఐ ఎ న్ టి యు. తదితరులు పాల్గొన్నారు