హైటెక్ సిటీ ప్రాంతంలో తమ్మిడికుంట డెవలప్మెంట్ చేసిన హైడ్రా .700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా*
హైదరాబాద్: కొండాపూర్లో రూ.700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. శేరిలింగం పల్లి మున్సిపల్ కార్యాలయం- మదీనగూడ మార్గంలో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. స్థానిక జంగమోని కుంటకు సంబంధించిన 4 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆక్రమించారు. మట్టిపోసి ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధమయ్యారు. దీంతో వారిపై రెవెన్యూ అధికారులు కేసులు పెట్టారు. ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు కుంట చుట్టూ ఫెన్సింగ్ ప్రక్రియ చేపట్టారు.