1986లో ఋషికేష్ పట్టణంలో గంగానది
ఒడ్డున ఒక అనాథ శవం కనిపించింది…
శరీరం కుళ్ళిపోయి ఉంది గుర్తుపట్టడానికి
చాలా శ్రమ పడ్డారు ఒక నెల రోజుల తర్వాత తేల్చగలిగారు ఆమె గొప్ప దేశభక్తురాలు
బీనాదాస్ అని…కలకత్తా విశ్వవిద్యాలయ
విద్యార్థిని దుర్మార్గ బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి
అయిన బెంగాల్ గవర్నర్ జాక్సన్ పై రివాల్వర్
ఎక్కుపెట్టి కాల్చిన ధైర్యశాలిని…బ్రిటిష్ ప్రభుత్వం బీనాదాస్ ని అరెస్ట్ చేసి తొమ్మిదేళ్ళ కఠిన జైలు
శిక్ష విధించింది జైలు జీవితంలో తొమ్మిదేళ్ళు
దుర్భరంగా గడపిన తర్వాత ఆమె విడుదలై
వచ్చి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో
పాల్గొని మళ్ళీ అరెస్ట్ అయ్యి మరోసారి జైలు
శిక్షలు అనుభవించింది…ప్రభుత్వం ఇచ్చే
స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్
తీసుకోవడానికి నిరాకరించింది దేశసేవకు
ప్రతిఫలం తీసుకోరాదు అని మనసారా
నమ్మిన నిస్వార్థ దేశభక్తురాలు…కాలం
గడిచింది ఆమెను అందరూ మరిచిపోయారు
ఋషికేష్ లో అనాధగా జీవించి మరణించింది..
ఇటువంటి అజ్ఞాత దేశభక్తులు ఎందరో వారి
త్యాగాల మీద బ్రతికే ఈ నేలలో కనీసం
వారి పేరును కూడా ఏడాదికి ఒక్కసారైనా
తలవని దౌర్భాగ్యం మనది…బీనాదాస్
వంటి ఎందరో మహనీయుల ఆత్మర్పణ
ఫలితం మనం ఇప్పుడు అనుభవిస్తున్న
ఈ స్వాతంత్ర్యం…
జైహింద్ 🇮🇳 🇮🇳 🇮🇳