janatawar.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 2:51 pm Editor : Admin

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బ్యాగులు పంచిన ఎమ్మెల్యే

జనతా వార్  గణతంత్ర దినోత్సవం సందర్భంగా హఫీజ్ పేట డివిజన్ లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమం*

హఫీజ్ పేట డివిజన్ లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించి మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ చేసిన *ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ*

హఫీజ్ పేట డివిజన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా హఫీజ్పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *గౌతమ్ గౌడ్* ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, *ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు*.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఎసి (PAC) చైర్మన్ మరియు శేరిలింగంపల్లి *ఎమ్మెల్యే శ్రీ అరికెపూడి* గాంధీ గారు తన చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులను అందజేశారు.

ఈ సందర్భంగా *ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ* గారు మాట్లాడుతూ.. *విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, వారికి అండగా నిలవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు*. *గణతంత్ర దినోత్సవం వంటి పవిత్రమైన రోజున విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన గౌతమ్ గౌడ్ గారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు*.

కార్యక్రమ నిర్వాహకులు *గౌతమ్ గౌడ్ గారు మాట్లాడుతూ.. సేవా దృక్పథంతో విద్యార్థుల చదువుకు తమవంతు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు*. తమ పిలుపును మన్నించి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.