janatawar.com
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 5:20 am Editor : Admin

వైన్స్ షాపులను సందర్శించిన సిపిఐ నారాయణ

ఖమ్మంలో వైన్ షాపును సందర్శించిన సిపిఐ నారాయణ…

జనతా వారు  ఖమ్మం జనవరి 19

ఖమ్మం: ప్రభుత్వాలు మారిన లిక్కర్ పాలసీలలో మాత్రం మార్పులు రావడం లేదు..

గత ప్రభుత్వాలు కంటే ఈ ప్రభుత్వాలు ఎక్కువ డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు.

గత ప్రభుత్వం పెట్టిన బెల్ట్ షాపును తీసేస్తామని హామీలిచ్చిన ఇపుడు బెల్ట్ షాపులు పెంచేశారు. మూడు లక్షల వరకు అప్లికేన్ ఫీజు పెంచారు.

వైన్ షాపులో పక్కనే నంచుకోవడానికి ఉపయోగపడే షాపులు కూడా నడిపిస్తున్నారు.ఆ వైన్ షాపులు కానుకుని కూర్చుని తాగడానికి ఓపెన్ బార్ లను ఏర్పాటు చేస్తున్నారు.ప్రజలను దోపిడీ చేయడానికి ఉపయోగపడే సాధనంగా మారుతున్నాయి.

లిక్కర్ షాపుల వలన ప్రజలపై భారాలు పెంచుతున్నారు .