janatawar.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 8:51 am Editor : Admin

ఘనంగా కూడారై ఉత్సవం..

శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఘనంగా కూడారై ఉత్సవం

హనుమాన్ జంక్షన్. బాపులపాడు మండలం రంగయ్య అప్పారావుపేట గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న గోదాదేవి అమ్మవారికి ధనుర్మాసం లోకంలో భాగంగా నేడు కూడారై ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ కోశాధికారి పరుచూరి సుకన్య తెలియజేశారు. 108 పాత్రలలో ప్రత్యేకంగా తయారుచేసిన పాయసం ప్రసాదాన్ని గోదా రంగనాథ స్వామి వార్లకు నివేదించి గ్రామస్తులకు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఆలయ ప్రధాన అర్చక స్వామి సామవేదం అరుణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి రామకృష్ణ, కొల్లిపర రత్న మాణిక్యం, లింగం జ్యోతి, పరుచూరి వెంకటసుబ్బమ్మ, సామవేదం శివకుమారి, కొత్తపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.